Friday, April 26, 2024

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. హత్యా.. ఆత్మహత్యా..?

పెద్ద‌ప‌ల్లి: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని బండారి కుంట లో నివాసం ఉంటున్న బరిగల కావ్య (24) మృతి చెందిందని స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, ఎస్ఐ రాజేష్ లు పరిశీలించారు. కావ్య చున్నీతో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుందా లేకపోతే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐదేళ్ల క్రితం సందీప్ తో వివాహం జరిగిందని, అప్పటినుండి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని కావ్య తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురిని అదనపు కట్నం కోసం హత్య చేశారని నిందితులపై కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏసిపి సారంగపాణి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement