Tuesday, May 7, 2024

మంత్రి జగదీశ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు.. మొక్క‌లు నాటిన మంత్రి

మంత్రి జగదీశ్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సందేశాన్ని జగదీష్‌ రెడ్డికి పంపారు.

కాగా.. ఇవ్వాల (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి మంత్రుల నివాస స‌ముదాయంలో మొక్క‌లు నాటారు. ఇక‌.. ప‌లువురు ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్ లోనూ జగదీశ్‌ రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, రవీందర్ నాయక్, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, చిలమర్తి లింగయ్య, పార్టీ కార్యాలయం ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement