Monday, April 29, 2024

సమస్యల పరిష్కారానికే తొలిపొద్దు.. మానకొండూరు ఎమ్మెల్యే బాలకిషన్

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తొలిపొద్దు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలం లోని పోరండ్ల, మొగిలిపాలెం గ్రామాల్లో పర్యటించి ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement