Friday, May 17, 2024

Atchampet – కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న 200 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు

అచ్చంపేట ఏప్రిల్ 29 ప్రభ న్యూస్ బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన 200 మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వారికి కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యవహార శైలి నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినా డాక్టర్ మల్లురవిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలు కష్టపడతామని వారు తెలిపారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ రోజురోజుకు కారుకు బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయని చమత్కరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బల్మూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement