నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత దంపతులు. నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకున్నది. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తువమోర్తె, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన అన్నిముఖం, మూలమంత్ర మూర్తి, మంత్ర వావనం, మృత్తికాస్నపనం, నయనోన్మీలనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత హవనం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయి.
కాగా, సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర మూర్తి మంత్ర హవనములు, ప్రతిష్ఠా విగ్రహాలకి క్షీరాధివాసము కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత దంపతులు పాల్గొంటున్నారు.