Thursday, April 25, 2024

రూ. 2 లక్షల ఎల్‌ఓసి..

ఇల్లంతకుంట: మండలంలోని పెద్దలింగపూర్‌ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పసుల కేశవులు కుమారుడు పసుల హరీష్‌ కానిస్టేబుల్‌ శిక్షణలో భాగంగా రన్నింగ్‌ సమయంలో ఒక్కసారిగా కుప్పకులాడు. ఆస్పత్రిలో వైద్య ఖర్చులకై మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయిబలకిషన్‌ దృష్టికి తీసుకుపోగా ప్రభుత్వం నుండి ఎల్‌ఓసి ద్వారా రూ. 2లక్షలు మంజూరు కావడంతో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, జడ్పీ వైస్‌ చెర్మెన్‌ సిద్ధం వేణులకు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్‌ చెర్మెన్‌ సిద్ధం వేణు, ఏఎంసి డైరెక్టర్‌ మీసరగండ్ల అనీల్‌ కుమార్‌, పసుల కేశవులు, బాబులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement