Thursday, April 25, 2024

గొప్ప విద్యవేత్తను కోల్పోయాం..

ఎల్లారెడ్డిపేట : మండల విద్యాధికారి మంకు రాజయ్య మృతి చెందడం బాధాకరమని, గొప్ప విద్యావేత్తను కోల్పోయామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్న సామజికవేత్త అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్స్‌ జేఏసీ చైర్మన్‌గా ఆయన చేసిన ఉద్యమం కీలకమైందన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసాగా ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి పాఠశాలలలను బలోపేతం చేసిన ఘనత తనకే దక్కిందన్నారు. ఇంచార్జి ఎంఈవోగా పనిచేస్తూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బడుల బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. వ్యక్తిగతంగా ఉద్యమ కాలం నుంచి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement