Sunday, May 5, 2024

అర్ధ రాత్రి శిశువు కిడ్నాప్ కలకలం.. 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుని సంతోషంతో గడుపుతున్న సమయం. దాదాపు రాత్రి 10 గంటలు దాటి ఉంటుందేమో . కరీంనగర్ -I టౌన్ పరిధిలోని అశోక్ నగర్ లో 1 ½ సంవత్సరాల శిశువు కిడ్నాప్ అయ్యిందన్న సమాచారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి 4 గంటల్లోనే కేసును ఛేదించి శిశువును సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉంది. టెక్నాలజీ సహాయంతో ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

కాగా, ఈ కేసులో కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో ప్రైవేటు డ్రైవరుగా పనిచేస్తున్న శనిగరపు సంతోష్, అతని దోస్తు కొలమద్ది రాములు కలిసి చిన్నారిని కిడ్నాప్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. కరీంనగర్​, అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ కుత్బోద్దీన్ మాంసం వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా నిందితులు కిడ్నాప్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement