Friday, May 3, 2024

సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకుందామన్న కోరుకంటి​. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులతో సహపంక్తి భోజనం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజహిత సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చెస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ప్రతి ముఖంలో అనందం నింపుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రుణం తీర్చుకుందామని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని బృందవన్ గార్డెన్స్ లో రామగుండం మండల పరిధిలోని 136 మంది కళ్యాణ లక్ష్మి, షాధిముభారక్ లబ్ధిదారులకు 1 కోటి 36 లక్షల 15 వేల 776 రూపాయల చెక్కులను అందించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులతో కలసీ సహపంక్తి భోజనం చేశారు. గతంతో లంబాండి తండల్లో అడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితులుండేవనీ.. కేసీఆర్‌ పాలనలో అడబిడ్ద పుడితే మహలక్ష్మి జన్మించిందని సంబరాలు చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్​. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement