Friday, April 26, 2024

కార్మికుల హక్కుల కోసం పోరాడుదాం..

గోదావరిఖని: పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దామని ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచి కార్యదర్శి శనిగల శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆర్జీ1 అతిథి గృహంలో కార్యదర్శి తోకల రాజేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడే ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చికాగో అమరవీరుల స్ఫూర్తిగా సాధించుకున్న కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు చేయాలన్నారు. కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ తదితర నిర్ణయాలతో కార్మికుల హక్కులను కాలరాసే కుట్ర పన్నుతున్నారని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. మే 1న కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య, సూరి బాబు, లక్ష్మణ్‌, హాబిబ్‌, జయమ్మ, లత, తిరుపతమ్మ, మల్లేశ్వరి, హనుమమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement