Friday, April 19, 2024

కొవిడ్ బాధితుల‌కు స‌త్వ‌ర చికిత్స అందించండి – బాల‌కృష్ణ‌

అనంతపురం: హిందూపురంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ టిడిపి ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడిని కోరారు… నేటి ఉద‌యం బాల‌య్య క‌లెక్ట‌ర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ దివాకర్ బాబు తో క‌రోనాపై ఫోన్ లో మాట్లాడారు…నియోజ‌క‌వ‌ర్గంలోని సెకండ్ వేవ్ ఉదృతిపై వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హిందూపురం ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కరోనా రోగులకు అన్ని వసతులు కల్పించి వైద్యం అందించాలని డీఎంహెచ్‌వోకు సూచనలు చేశారు. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని బాలకృష్ణ హిందుపురం ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement