Wednesday, April 24, 2024

కరోనా నివారణ చర్యలు..

ఎన్‌టీపీసీ: కార్పొరేషన్ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్థానిక 39వ డివిజన్ ఖాజిపల్లి, మాతంగి కాలనీ, శాంతి నగర్‌, ప్రగతినగర్‌ లో కార్పొరేటర్‌ జెట్టి జ్యోతి రమేష్‌ ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. ప్రజలంతా మాస్క్‌ ధరించి, గోరు వెచ్చని నీరు తాగాలని, శానిటైజర్‌ వాడాలని జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్‌ ఆడెపు శ్రీనివాస్‌, వైకుంటం, నాయకులు జెట్టి రమేష్‌, దేవేందర్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement