Thursday, May 9, 2024

KNR: వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష

కరీంనగర్ (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం నాయకులు నిరాహార దీక్షకు దిగారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ… 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement