Tuesday, May 21, 2024

WGL: దారుణం.. భార్యను రోకలి బండతో కొట్టి హతమార్చిన భర్త

కాటారం, జులై 31 (ప్రభ న్యూస్ ): భార్యభర్తల మధ్య అదనపు వరకట్నం గొడవ భార్య హత్యకు దారితీసింది. భార్యను హత్య చేసిన భర్త ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందినట్లు చిత్రీకరించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిల్లవంచ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనలో చిగురు సంధ్యను భర్త చిగురు గణేష్ రోకలిబండతో కొట్టి చంపినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది.

గారేపల్లి గ్రామానికి చెందిన సంధ్యతో ఒడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్ కు గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి అన్యోన్య కాపురానికి పాప, బాబు ఇద్దరు పిల్లలు జన్మించారు. అయినప్పటికీ భర్త గణేష్ అదనపు కట్నం కోసం తరచుగా గొడవలు జరుగుతున్నట్లు పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఉదయం కాటారం ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement