Saturday, May 4, 2024

కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి.. మంత్రి గంగుల

కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఇవాళ కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో.. 1 కోటి 90లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు.. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థలో విలీనమైన డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయితీగా వున్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని.. రేకుర్తి 18,19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు.. పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్లన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధ గుని మాధవి కృష్ణ గౌడ్ ఏదుల్ల రాజశేఖర్, కార్పొరేటర్లు, వి.రాజేందర్ రావు, భూమా గౌడ్, జంగిలి సాగర్ దీండిగాల మహేష్, గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, భారసా నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్ డివిజన్ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement