Monday, May 6, 2024

కుల సంఘాలకు ప్రభుత్వ పెద్దపీట : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

జూలపల్లి : కుల సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో యాదవ కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్‌ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుల సంఘాల భవనాల నిర్మాణంతోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేచరేణి రాధా శ్రీనివాస్‌, ఎంపీపీ రమాదేవి, జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్‌, ఎంపీటీసీ పల్లె స్వరూప, ప్రసాద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దండే వెంకటేశ్వర్లు, మచ్చ యాదగిరి, యాదవ సంఘం అధ్యక్షుడు మంద స్వామి, ఉపాధ్యక్షుడు రేచవేని మల్లయ్య, వేల్పుల తిరుపతి, కొమ్మ పోచాలుతోపాటు కమిటీ- సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement