Monday, April 29, 2024

విఘ్నాలను తొలగించే గణపతి : రామగుండం సీపీ చంద్రశేఖర్‌ రెడ్డి

గోదావరిఖని టౌన్ : విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారన్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తాము మొదలు పెట్టిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని మహా గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందన్నారు. పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద యువత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఇదే రీతిలో నిమజ్జన ఉత్సవాల్లో సైతం ప్రతి ఒక్కరు పోలీస్‌ శాఖకు సహకరించాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రూపేష్‌, అడ్మిన్‌ డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏఆర్‌ ఏసీపీ సుందర్‌రావు, ఆర్‌ఐలు మధుకర్‌, శ్రీధర్‌, విష్ణు ప్రసాద్‌, ఐటి, కమ్యూనికేషన్‌ ఇన్స్పెక్టర్‌ రాం ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement