Tuesday, March 26, 2024

పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. దాసరి మమతరెడ్డి

పెద్దపల్లి : పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులతోపాటు దుస్తుల మెటిరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… స్వచ్ఛ పెద్దపల్లి కోసం చేపడుతున్న కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. చెత్తచెదారం తొలగింపు, మురికి కాలువలను శుభ్రం చేయడం, దోమల వ్యాప్తి నియంత్రణలో వారు అందిస్తున్న సేవలు మరవలేనివన్నారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతితోపాటు పలువురు కౌన్సిలర్లు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement