Sunday, May 5, 2024

పెద్దపల్లిలో ఫ్రీడం రన్.. ప్రారంభించిన కలెక్టర్ సంగీత

భారత స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఫ్రీడం రన్ నిర్వహించారు. స్థానిక ఐటిఐ మైదానంలో ఫ్రీడం రన్ ను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. ఐటిఐ నుండి జూనియర్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన పరుగులో అధికారులు, ఉద్యోగులతో పాటు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చెన్నూరి రూపేష్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమత, ఏ సిపి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రాజేష్, మౌనిక, సహదేవ్ సింగ్, రవీందర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement