Sunday, May 5, 2024

కొత్త‌గా 16,299క‌రోనా కేసులు-53మంది మృతి

క‌రోనా కేసులు 16,299న‌మోద‌య్యాయి. దాంతో మొత్తం కేసులు 4,42,06,996కు చేరాయి. ఇందులో 4,35,55,041 మంది కోలుకున్నారు. 5,26,879 మంది మృతిచెందారు. మరో 1,25,076 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19,431 మంది కోలుకోగా, 53 మంది కరోనాకు బలయ్యారు. కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ రికవరీ రేటు 4.58 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 25,75,389 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొన్నది. దీంతో మొత్తం 207.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement