Thursday, May 16, 2024

ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు..

తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన అనుపురం రాజమల్లు బ్రిక్స్ వ్యాపారం నిర్వహిస్తూ కరీంనగర్ లో నివాసం ఉంటున్నాడు. తన భార్య రమ కూతురు ఆకాంక్షతో కలిసి డ్యాం వ‌ద్ద ఉన్న నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చాపల కాలని మసీద్ ఎదురుగా లారీ వెనుక నుంచి వ‌చ్చి వారిని ఢీ కొట్టడంతో ర‌మ‌ అక్కడక్కడే మృతి చెందింది. అక్షయ, రాజమల్లుకు తీవ్ర‌ గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement