Saturday, May 4, 2024

చికిత్స‌ పొందుతూ.. రైతు మృతి

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది .చికిత్స పొందుతున్న రైతు శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు , అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ అనుబంధ గ్రామం అయిలవాని పల్లికి చెందిన ఏనుగుల మల్లేషం ( 48 )
కు గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది . గత తహసీల్దార్ 4.21 ఎకరాలకు ధరణి పోర్టల్ ద్వారా నూతన పాస్ పుస్త‌కం అందజేశారు . మిగతా 20గుంటలు ఇంటిస్థలం కింద నమోదు కావడంతో ధరణిలో నమోదు కాలేదు . దీంతో పరిష్కరించాలని కోరుతూ తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అధికారులతో విసిగిపోయి కొత్తపల్లి త హసీల్దార్ కార్యాలయంలోనే వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆ త్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. . గమనించిన తహసీల్దార్ వెంకట్ రెడ్డి స్పందించి బాధితుడిని హుటాహుటిన నగరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు . బంధువులు బాధితుడిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement