Monday, May 13, 2024

Education Day: జెడ్పి పాఠశాలను ప్రారంభించిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా రూ.8 కోట్లతో ఆధునికంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్ రావు, ఎం ఎల్ సీ రఘోతం రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవ రెడ్డి, నాప్ కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా బి అర్ ఎస్ అధ్యక్షుడు తోట అగాయ్య, ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, సర్పంచ్ వెంకట్ రెడ్డీ, ఎంపిటిసిలు, జిల్లా నాయకులు, అధికారులు భారీగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే గంభీరావుపేట మండలం గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement