Friday, May 3, 2024

Telangana: సోదరి స్నేహితురాలిపై యువకుడి అత్యాచారం

సోదరి స్నేహితురాలిపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఓ యవకుడు ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రమేష్‌ (22) అనే యువకుడికి చెల్లి ఉంది. అయితే ఓసారి వాళ్ల ఇంటికి రమేష్ చెల్లి స్నేహితురాలు(14) వచ్చింది. ఆ సమయంలో రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు.

అయితే తన సొదరి స్నేహితురాలిని బెదిరించి అత్యాచారం చేశాడు. అలాగే పలుమార్లు ఆ బాలికపై రమేష్ అత్యాచారం చేశాడు. అయితే ఇటీవల ఆ బాలిక ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి చూపించారు. ఆ బాలిక ఐదు నెలల గర్భవతిగా వైద్యులు తేల్చారు. దీంతో ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement