Monday, April 29, 2024

విద్య దినోత్స‌వం.. పాల‌కుర్తిలో మంత్రి ఎర్ర‌బెల్లి విస్తృత ప‌ర్య‌ట‌న‌

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ విద్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా పలు పాఠశాల భవనాలను, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి అంగన్‌వాడీ పాఠశాలను ప్రారంభించారు. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను, పెద్ద బాయి తండా గ్రామ పంచాయతీ భవనాన్ని, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని, హై స్కూల్లో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.

ఈ వేడుకల్లో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించి, విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం బావోజీ తండా లో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామంలో నూతన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించి, విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తదుపరి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement