Sunday, May 5, 2024

కరీంనగర్‌లో దంపతుల ఆత్మహత్య

దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని క‌రీంన‌గ‌ర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. భాగ్యలక్ష్మి, వెంకటేష్ దంపతులు ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబకలహాలే అఘాయిత్యానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement