Monday, April 29, 2024

కరోనా వ్యాక్సీనేషన్..

మెట్‌పల్లి రూరల్‌: మండలంలోని ఆత్మకూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జగ్గాసాగర్‌ ఆధ్వర్యంలో క్యాంపు ఏర్పాటు చేసి 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్‌ వాక్సిన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చౌట్‌ పల్లి లావణ్య అంజయ్య, నాయకులు తుమ్మల రాజారెడ్డి, మొండి మహేష్‌, కార్యదర్శి వినీత, జిల్లా ప్రత్యేక అధికారి శ్రీపతి, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ రఘుపతి, రాజేందర్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement