Saturday, April 20, 2024

పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో ఎన్నిక‌ల ప‌రిశీల‌కురాలు చ‌ర్చ‌లు…

వ‌రంగ‌ల్ – గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ క్రిస్టీనా జెడ్ చోంగత్తును వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి గురువారం సర్కూట్ గెస్ట్ హౌజ్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో పోలీసుల పరంగా చేపడుతున్న చర్యలు, తీసుకొంటున్న జాగ్రత్తలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలకురాలుగా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్టు అధికారుల‌కు తెలిపారు . రాత్రి కర్వ్యూతో శాంతి,భద్రతలకు ఎలాంటి భంగం కలుగబోదన్న అవగాహనాకొచ్ఛిన్నట్టు సమాచారం. కరోన కల్లోల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్రలపై కూడా ఇరువురు చ‌ర్చించిన‌ట్లు సమాచారం…

Advertisement

తాజా వార్తలు

Advertisement