Friday, April 26, 2024

ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ2 ఏరియా ఓసీపీ3లో జనరల్‌ మజ్దుర్‌గా పని చేసిన సుంకరి వెంకటస్వామి కరోనా సోకి గత సెప్టెంబర్‌ 7న మరణించగా కోవిడ్‌-19 ఎక్స్‌గ్రేషియా కింద రూ. 15లక్షల చెక్కు మంజూరు కావడంతో సోమవారం జీఎం వెంకటేశ్వర్‌రావు వారి కుటుంబానికి పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌ , అధికారులు సాంబయ్య, మురళీకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, వేణుగోపాల్‌, సురేందర్‌, పిట్‌ కార్యదర్శి భేతి చంద్రయ్యలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement