Monday, May 20, 2024

Peddapalli: ప్రజలందరికీ శుద్ధ జలాలు.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్): గ్రామ ప్రజలందరికీ శుద్ధ జలాలు అందించే లక్ష్యంగా శుద్ధ జల కేంద్రం ఏర్పాటు చేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం పెద్దపల్లి మండలం ముత్తారం, దర్మాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు.

గ్రామానికి చెందిన కీర్తి రాయగట్టు తన తండ్రి వెంకటయ్య స్మారకార్థం శుద్ధజల కేంద్రాన్ని స్వంత ఖర్చులతో నెలకొల్పారన్నారు. ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలనే గొప్ప సంకల్పంతో ప్లాంటు ఏర్పాటు చేసిన రాయగట్టును ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎద్దు కుమారస్వామి, నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, మధుకర్ రెడ్డి, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement