Wednesday, May 15, 2024

ఆధ్మాత్మిక భావంతోనే ప్రశాంతత.. మంత్రి కొప్పుల

ధర్మారం : ఆధ్యాత్మిక భావంతోనే ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి కొప్పుల భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని, తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఒత్తిడిని జయించేందుకు, ప్రశాంత జీవనం గడిపేందుకు ఆలయాలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం మంత్రి కొప్పులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించగా, కమిటీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పి.పద్మజ, సర్పంచ్‌ సత్తయ్యగౌడ్‌, ఎంపీటీ-సీ దాడి సదయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement