Thursday, May 16, 2024

హైలేవల్ బ్రిడ్జీ నిర్మించండి : కోరుకంటి చందర్..

పెద్దపల్లి జిల్లా లోని పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ లో బ్రాహ్మణపల్లి, పోట్యాల మధ్య మర్రిపల్లి రోడ్దు లో హైలేవల్ బ్రిడ్జీ నిర్మించాలని రాష్ట్ర రోడ్డు భవనాల ఇంజనీరింగ్ చీఫ్ రవీందర్ రావు ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. మంగళవారం వారిని హైదరాబాద్ లో కలిసి ఇటివల కురిసిన వర్షాల కారణంగా కాలువా నిండి నీరు రోడ్డుపై ప్రవహించదని దీంతో సోమన్పల్లి ఆకెనపల్లి పోట్యాల మద్దర్యాల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎర్పాడ్డాయని తెలిపారు. కుక్కలగూడూర్, బ్రాహ్మణపల్లి వద్ద హైలేవల్ బిడ్జీ నిర్మింణంతో ప్రజల ఇబ్బందులు తోలిగిపోతాయన్నారు. త్వరగతిన హైలేవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement