Monday, April 29, 2024

సీజ‌న్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి : మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌

సీజ‌న్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునిల్ రావుతో కలిసి సందర్శంచి తనిఖీ చేశారు. హాస్పిటల్ లో విష జ్వరాలతో బాధ‌పడుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు అప్ర‌మ‌త్తంగా ఉండి ప్ర‌జ‌ల‌కు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని దేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement