Thursday, April 25, 2024

100 మంది ఆటో డ్రైవర్లకు మాస్కులు..

గోదావరిఖని: కరోనా నివారణ చర్యల్లో భాగంగా సామాజిక కార్యకర్త మడిపల్లి మల్లేశ్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని బస్టాండ్‌ యూనియన్‌కు చెందిన 100 మంది ఆటో డ్రైవర్లకు మణి ఆధ్వర్యంలో యూనియన్‌ అధ్యక్షుడు కడార్ల శ్రీధర్‌చే మాస్కులను పంపిణీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఆటో డ్రైవర్లు మల్లేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేషన్‌ ఆటో యూనియన్‌ ప్రధానకార్యదర్శి ఈర్ల ఐలయ్య, నాయకులు చాంద్‌ పాషా, నేరెళ్ల సత్యనారాయణ, ఆసంపల్లి తిరుపతి, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement