Wednesday, May 1, 2024

ఆమరణ దీక్షకి మద్దతివ్వండి..

ఇల్లంతకుంట: మంత్రి కేటీఆర్‌ మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చి 35 నెలలైనా ఇప్పటివరకు నెరవేర్చలేదని, సమస్యల సాధన కోసం ఈనెల 28 నుంచి చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతు ఇవ్వాలని బీజేపీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డుసభ్యులను కోరారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్‌ను కలిసి కరపత్రాలను పంపిణీ చేసి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన హామీలను వివరించారు. ప్రజా ప్రతినిధుల మద్దతుతో పోరాడి సమస్యలు సాధించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్‌, సుధగోని శ్రీకాంత్‌, గొట్టపల్లి బాబులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement