Tuesday, May 7, 2024

కార్యకర్తలే తెరాస పార్టీకి వెన్నెముక : ఎమ్మెల్యే దాసరి

తెరాస పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఓదెల మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన తెరాస కార్యకర్తల ముఖ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పని చేస్తున్న కార్యకర్తల కృషి వల్లే పార్టీ బలోపేతంగా మారుతుందన్నారు. కార్యకర్తలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందని గుర్తు చేశారు. తెరాస ప్రజాప్రతినిధులంతా పార్టీ కార్యకర్తలను గౌరవించాలని, కష్టకాలంలో వారికి అండగా నిలవాలని సూచించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ, మండల స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి సమస్య వచ్చినా తనతో చర్చించి పరిష్కరించుకోవాలని కోరారు. సీఎం కెసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, వారికి పార్టీని మరింత చేరువ చేసేలా ప్రతి కార్యకర్త ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీపీ రేణుకాదేవి, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వేంకట రెడ్డి, పొత్కపల్లి సింగిల్‌ విండ్డో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కావటి రాజు, మాజీ ఎంపిపి బుద్దే రామస్వామి, నాయకులు ఆకుల మహేందర్‌, రెడ్డి శ్రీనివాస్‌, గట్టు శ్రీనివాస్‌, మ్యాడగొని శ్రీకాంత్‌ గౌడ్‌ , తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement