Thursday, May 2, 2024

సింగరేణి ప్రతిభ పుస్తకాల పంపిణీ

రామగిరి: అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో జీఎం ఎన్వీకే శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సింగరేణి అద్భుత ప్రగతి అనే పుస్తకాలను ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఏఎల్‌పీ ప్రాజెక్టులో జరిగిన కార్యక్రమంలో జీఎం మాట్లాడుతూ 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 60 మిలియన్‌ టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ తనవంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేయడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు. రక్షణ తో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకతతో సింగరేణి అభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈకార్యక్రమంలో అధికారులు నాగేశ్వర్‌రావు, పాపయ్య, మారుతీ, దాసరి మల్లేశ్‌, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement