Tuesday, April 16, 2024

వ్యవసాయం చేస్తున్న రష్మిక

టాలీవుడ్ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉంది. మిష‌న్ మ‌జ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది‌. బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లీడ్‌ రోల్ పోషిస్తున్నాడు. ఇక త‌మిళంలో కార్తీ స‌ర‌స‌న సుల్తాన్ చిత్రంలో రష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, తాజాగా సినిమాకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో వ్య‌వ‌సాయం చేస్తున్న ర‌ష్మిక పొలాన్ని.. దుక్కి దున్నేందుకు బురదలోకి దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 2న ‘సుల్తాన్’‌ థియేటర్లలోకి రానుంది. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలోనూ నటిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement