Wednesday, May 15, 2024

పేద విద్యార్థికి ఆర్థికసాయం

ఎల్లారెడ్డిపేట: మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందిన నిరుపే విద్యార్థి శ్రావణికి తెరాస నాయకులు చేయూతనందించారు. బొప్పాపూర్‌కు చెందిన చిదురు గోవర్ధన్‌ గౌడ్‌ రూ. 50వేల ఆర్థికసాయం అందించారు. ఈకార్యక్రమంలో తెరాస జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, మార్కెట్‌ చైర్మన్‌ కొండ రమేశ్‌ గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బాల్‌రెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు రాదారపు వంకర్‌, విండో చైర్మన్‌ కృష్ణారెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కృష్ణహరి, కుంభాల మల్లారెడ్డి, భాస్కర్‌ గౌడ్‌, బాలరాజు నర్సాగౌడ్‌, ప్రకాశ్‌ గౌడ్‌, రమేశ్‌బాబులు పాల్గొన్నారు. గోవర్ధన్‌ గౌడ్‌, తెరాస నాయకులకు టీచర్‌ శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement