Monday, May 13, 2024

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

ఎల్లారెడ్డిపేట: మండలంలోని లాల్‌సింగ్‌ తండా గ్రామానికి చెందిన భూక్యా విజయ అనారోగ్య కారణాల చేత చనిపోగా ఆమె కుటుంబానికి అదే గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ రాధారపు సత్యం స్పందించి రూ. 10వేలు, ఇంటిపై కప్పుకు కావాల్సిన రేకులను అందించారు. అలాగే విజయ ఇద్దరు కుమారులకు దుబాయ్‌లో ఉద్యోగం కల్పించుటకు సహాయం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వీర్నపల్లి ఎంపిటిసి మల్లారపు అరుణ్‌ కుమార్‌, మడుపు తిరుపతి రెడ్డి, గ్రామ పెద్దలు మోహన్‌, మదన్‌, చిన్నారెడ్డి, ప రెంగి దేవ్‌సింగ్‌, మాలోత్‌ రామ్‌రెడ్డి, రాజు నాయక్‌, హరి సింగ్‌, రాజు, నందు, వర్జి, గజన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement