Sunday, May 19, 2024

Kalvakurty – ఎమ్మెల్యే క‌సిరెడ్డి కారు ను ఢీకొన్న బైక్ – ఇద్ద‌రు యువ‌కులు మృతి..

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్ర‌యాణిస్తున్న‌ కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. గ్రామ శివారులో ఎమ్మెల్యే కారును ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఈ ప్ర‌మాదంలో నరేశ్‌ (25) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతులను వెంకటాపుర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్‌ బెలూన్‌లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు చికిత్స కోసం ఆయ‌న‌ను హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు… కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement