Sunday, April 28, 2024

JP Nadda: కాళేశ్వ‌రం కేసీఆర్‌కు ఏటీఏంలా మారింది..జేపీ నడ్డా

బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఏటీఎం లాగా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేటలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ అవినీతి వల్లనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగిందని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందడం లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలన్నారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ స్వరూపాన్ని మార్చే ఎన్నికలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపికి ఓటేసి కేసిఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement