Monday, April 29, 2024

CM KCR :ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే… సీఎం కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్ర‌స‌గించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ… రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులే అన్నారు. అంతకుముందు పేదల బాధలను పట్టించుకున్నది లేదన్నారు. పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదన్నారు. తెలంగాణను నాశనం చేశారన్నారు.

అలంపూర్ నుంచి పార్టీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కరువు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగులో పెట్టిందన్నారు.ప్రజాస్వామ్యంలో గూండాలు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు గెలవకూడదన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నారు. ఇదివరకు పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆర్డీఎస్ నుంచి నీళ్లు తరలించుకుపోతున్నా అప్పుడు ఎవరూ మాట్లాడేవారు కాదన్నారు. పదవుల మీద ఆశతో కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాట్లాడలేదన్నారు. వాల్మికీ బోయలను బీసీలలో కలిపింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే వారిని ఎస్టీ జాబితాలో కలుపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement