Sunday, April 28, 2024

Janasena – భారత దేశానికి నరేంద్ర మోడీ అవసరం ఉంది – పవన్ కల్యాణ్

అమరావతి: భారత దేశానికి నరేంద్ర మోడీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడు.. ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేత.. బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం, ఐక్యతను పెంపొందించడం.. వివిధ రంగాలలో పరివర్తనాత్మక మార్పును నడిపించడం ద్వారా దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యం మోడీ. కి ఉంది’’ అని అన్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు తరాల శ్రేయస్సుపై ఆలోచన చేస్తారని కొనియాడారు. తన ‘విజన్ 2047’ని సాకారం చేయడానికి… జనసేన పార్టీ బీజేపీకి, మోడీకి మద్దతు ఇస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement