Tuesday, May 7, 2024

RR: అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న జనార్దన్ రెడ్డి

వికారాబాద్, సెప్టెంబర్ 11 (ప్రభ న్యూస్): గత పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన జనార్దన్ రెడ్డి సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు జనార్దన్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే శివరాజ్, కే మాధవరెడ్డి, నాయకులు కేపీ రాజు, కే వివేకానంద రెడ్డి, రాములు, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement