Friday, May 17, 2024

TS | మిర్యాలగూడ రైస్‌ మిల్లుల్లో ఐటీ సోదాలు..!

మిర్యాలగూడ, ప్రభన్యూస్‌ : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, హాలియా ప్రాంతాల్లో గల పలు రైస్‌ మిల్లుల్లో వాటి యాజమాన్యాల ఇండ్లల్లో గురువారం ఐటీ సోదాలు జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలో ప్రముఖ రైస్‌ మిల్లర్స్‌ యాజమాన్యమైన బండారు కుశలయ్య, రంగా రంజిత్‌ ల ఇండ్లతో పాటు వారి రైస్‌ మిల్లులైన మహాతేజ, ఎమ్మారైలలో ఐటీ అధికారులు దాడులు చేశారు. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్‌, వ్యాపారసంస్థల యజమానైనా ఇంజం శ్రీధర్‌ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు.

అంతేగాక శ్రీధర్‌ కు సంబంధించిన త్రిపురారం మండలంలోని వెంకటసాయి సాల్వెంట్‌ లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. అలాగే హాలియా మండలంలోని వజ్రతేజ రైస్‌ మిల్లులో.. యజమాని యాదగిరి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. మిర్యాలగూడ ప్రాంతానికి గురువారం తెల్లవారుజామున వచ్చిన 40 మంది ఐటీ అధికారులు.. బృందాలుగా విడిపోయి సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐటీ అధికారులు సోదాలు చేసే సంస్థల.. ఇండ్ల సమీపంలోకి ఎవరిని అనుమతించడం లేదు. సోదాలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement