Sunday, May 5, 2024

IPS Transfers – తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో 9 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవిని ప్రభుత్వం నియమించింది. వరంగల్‌ కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌ను హైదరాబాద్‌ జాయింట్‌ సీపీగా బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్‌పై వేటు వేశారు. రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావును నియమించారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవీస్ ఎస్బీ హైదరాబాద్‌ డీసీపీగా బదిలీ అయ్యారు. నార్త్‌ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శినిని నియమించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా విశ్వప్రసాద్‌, సిట్‌, క్రైమ్స్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌, పశ్చిమ మండల డీసీపీగా విజయ్‌కుమార్‌, ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్‌ డీసీపీగా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా ఎస్‌ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

గుజరావ్ భూపాల్‌, చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement