Monday, April 29, 2024

నల్గొండ‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుదల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో న‌ల్గొండలోని గాంధీన‌గ‌ర్ కాల‌నీకి చెందిన‌ విద్యార్థిని జాహ్న‌వికి ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల్లో త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. నల్గొండ‌ రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని స‌మాచారం. ఈ ఘ‌ట‌న పై స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement