Tuesday, May 7, 2024

ఈనెల 11 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్ధులకు ఈనెల 11వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. గురువారం పదో తరగతి ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఫస్ట్‌ ఫేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియను ఈరోజు నుంచి చేపట్టనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

సెప్టెంబర్‌ 17 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, రెసిడెన్షియల్‌ కళాశాలల యాజమాన్యాలకు ఆదేశించారు. రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయించాలని సూచించారు. ఎలాంటి అడ్మిషన్‌ టెస్టులు నిర్వహించకుండా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement