Wednesday, May 1, 2024

TS: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం.. సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : వైద్య విద్యలోనే నవశకం… రాష్ట్రంలో 9మెడికల్ కళాశాలలు ప్రారంభమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినమన్నారు. ఒకే సారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించుకోవ‌డం.. సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టమన్నారు. ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్య‌క్ర‌మం చాలా ఆత్మసంతృప్తి క‌లిగే గొప్ప స‌న్నివేశమన్నారు. ఎందుకంటే ప‌రిపాల‌న చేత‌కాదు అని ఎగ‌తాళి చేసిన ప‌రిస్థితుల‌ను చూశాం. అటువంటి తెలంగాణ‌లో ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ సంవ‌త్స‌రంలో దాదాపు 24 వ‌ర‌కు చేరుకున్నామన్నారు.

గ‌తంలో ఐదు మెడిక‌ల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి 8 కాలేజీలు నూత‌నంగా ప్రాంరంభం కాబోతున్నాయన్నారు. వీటికి కేబినెట్ ఆమోదం కూడా ల‌భించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.2014లో 2850 మెడిక‌ల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైద్య‌శాఖ మంత్రి, కార్య‌ద‌ర్శిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నానన్నారు. 85 శాతం మెడిక‌ల్ సీట్లు తెలంగాణ బిడ్డ‌ల‌కే ద‌క్కాల‌ని ప‌టిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించామని, అది గొప్ప విజ‌యమన్నారు. ప్ర‌యివేటు, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ద్వారా సంవ‌త్స‌రానికి 10వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్నామన్నారు. మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధ‌క శ‌క్తి ఉండాలంటే.. తెల్ల ర‌క్త క‌ణాలు ఏ విధంగా ప‌ని చేస్తాయో.. తెలంగాణ ఉత్ప‌త్తి చేయ‌బోయే తెల్ల కోట్ డాక్ట‌ర్లు రాష్ట్రానికే కాదే.. దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను కూడా కాపాడుతారని కేసీఆర్ వివ‌రించారు. ఇందులో ఎవ‌రికి సందేహం లేదన్నారు.

- Advertisement -

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించామన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామన్నారు. ఒక దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. ఎక్క‌డైతే వైద్యారోగ్య వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుందో.. అక్క‌డ త‌క్కువ మ‌ర‌ణాలు, న‌ష్టాలు సంభ‌విస్తాయని కేసీఆర్ తెలిపారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడిక‌ల్ కాలేజీల‌తో పాటు అద్భుత‌మైన ఆస్ప‌త్రుల‌ను కూడా తీసుకువ‌స్తున్నామన్నారు. వైద్యారోగ్య శాఖ చాలా విజ‌యాలు సాధించిందన్నారు. దేశంలో ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇది మ‌న సాధించిన ఘ‌న‌త అన్నారు. రాష్ట్రం ఏర్ప‌డే నాటికి 17 వేల ప‌డ‌క‌లు ఉంటే.. ఇప్పుడు 34 వేల ప‌డ‌క‌ల‌కు చేరుకున్నామన్నారు. మ‌రో 6 హాస్పిట‌ల్స్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. వ‌రంగ‌ల్‌లో అద్భుత‌మైన హాస్పిట‌ల్ నిర్మాణం జ‌రుగుతోందన్నారు. హైద‌రాబాద్‌కు న‌లువైపులా టిమ్స్ నిర్మిస్తున్నామన్నారు. క‌రోనా టైంలో ఆక్సిజ‌న్ చాలా అవ‌స‌రం ఉండేదని, దాన్ని గుణ‌పాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోనేందుకు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించుకున్నామని కేసీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement